News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 23, 2025
నాగర్కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్.!

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశము ఉందని నివేదికలో పేర్కొన్నారు.
News March 23, 2025
విశాఖలో సందడి చేసిన చిత్రబృందం

విశాఖలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రబృందం సందడి చేశారు. ఆదివారం విశాఖలో ఒక హోటల్లో మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఇది సిద్ధమవుతోందన్నారు. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు. హీరోయిన్ దీపికా ఉన్నారు.
News March 23, 2025
అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.