News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
NRPT: చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలి: కలెక్టర్

నారాయణపేట జిల్లాలో చిత్తడి నేలల (వెట్ల్యాండ్స్) జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మూడు నెలల్లోపు చిత్తడి నేలల జాబితాను తయారు చేయాలని, ఏడాదిలోపు సమగ్ర డిజిటల్ జాబితాను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. గుర్తింపులో నిబంధనలు తప్పక పాటించాలని ఆమె స్పష్టం చేశారు.
News November 22, 2025
సిద్దిపేట: ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ హేమావతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు జిల్లాలో గల 508 గ్రామపంచాయతీలు, 4508 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో 2011 సెన్సెస్ ప్రకారం చేపట్టాలని, 50% రిజర్వేషన్లు మించకుండా చేయాలన్నారు.
News November 22, 2025
సిద్దిపేట: ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ హేమావతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు జిల్లాలో గల 508 గ్రామపంచాయతీలు, 4508 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో 2011 సెన్సెస్ ప్రకారం చేపట్టాలని, 50% రిజర్వేషన్లు మించకుండా చేయాలన్నారు.


