News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు‌ అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

వీణవంక సర్పంచ్‌గా దాసరపు సరోజన విజయం

image

వీణవంక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచారు. తన గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వీణవంకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా సరోజన హామీ ఇచ్చారు.

News December 17, 2025

మెస్సీకి అంబానీ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నిన్న గుజరాత్‌లోని <<18586214>>వనతార<<>>ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతి ఇచ్చారు. రిచర్డ్ మిల్లీ RM 003 V2 వాచ్‌ను బహూకరించారు. దీని విలువ దాదాపు రూ.10.91 కోట్లు కావడం గమనార్హం. ఈ లిమిటెడ్ ఆసియా ఎడిషన్ వాచ్‌లు ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయి. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13-16 తేదీల్లో ఇండియాలో మెస్సీ పర్యటించారు.

News December 17, 2025

భద్రాద్రి: ‘జగన్’పై ‘చంద్రబాబు’ విజయం

image

జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ ఎన్నిక ఫలితం జిల్లావ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ మద్దతుదారు చంద్రబాబు, తన సమీప ప్రత్యర్థి జగన్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది.