News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
News November 18, 2025
నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళా

నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళాలు నిలుస్తున్నాయి. సింగరేణి ప్రాంత యువతీ, యువకుల కోసం హైదరాబాద్కు చెందిన పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పెట్టి వేలాది యువతకు కొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3500 మంది అభ్యర్థులు పాల్గొనగా.. 2,000 మందికి ఉపాధి లభించింది.


