News March 20, 2025

హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

Similar News

News December 21, 2025

సూపర్ ఫామ్‌లో కాన్వే.. మరో సెంచరీ

image

వెస్టిండీస్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.

News December 21, 2025

త్వరలోనే తిరుపతి జిల్లాలో DT కేంద్రాలు

image

డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన డ్రైవర్లతో ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరింత పటిష్టం చేసేలా DTC ఉపయోగపడుతుంది. 10లక్షల మందికి ఓ కేంద్రం చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తిరుపతి జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటుకు రవాణా శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తిరుపతి రూరల్ పుదిపట్ల, తూకివాకం, కాపుగన్నేరిలో ఈ DTCలు ఏర్పాటు చేస్తారు.

News December 21, 2025

రాష్ట్రంలో 182 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

APలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో 182 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 35-65ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: wdcw.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.