News March 20, 2025
హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
Similar News
News December 11, 2025
ములుగు: 2 గంటల్లో.. 13.31 శాతం ఓటింగ్

ములుగు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 13.31% ఓట్లింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు గోవిందరావుపేట మండలంలో 10.65%, ఏటూరునాగారం – 10.86, తాడ్వాయిలో 20.03% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు, అధికారులు మండలాల వారీగా పర్యటిస్తూ పోలింగ్ సరలిని పర్యవేక్షిస్తున్నారు.
News December 11, 2025
ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


