News March 1, 2025

హనుమకొండ: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

image

మార్చి 21 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News December 10, 2025

ప.గో: పందెం కోళ్లకు బౌన్సర్ల సెక్యూరిటీ కావాలేమో..!

image

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.

News December 10, 2025

కామారెడ్డిలో ఎన్నికల ముచ్చట్లు

image

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 156 గ్రామాల్లో సర్పంచ్ పదవికి 727 మంది, 1084 వార్డులకు 3048 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. మూడో విడతో 168 పంచాయతీలకు గానూ 26 సర్పంచులు ఏకగ్రీవం కాగా, 142 సర్పంచ్ స్థానాలకు 442 మంది బరిలో ఉన్నారు.

News December 10, 2025

ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

image

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్‌కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు.