News March 12, 2025

హనుమకొండ: పూడికతీత వేగంగా జరగాలి: కలెక్టర్లు

image

భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్య శారద అన్నారు. భద్రకాళి చెరువులో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 5, 2025

అనకాపల్లి: పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి

image

పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించి ఇన్సూరెన్స్ బాండ్లను పోలీస్ సిబ్బందికి అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసులకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు శ్రమించే పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.

News December 5, 2025

MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

image

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.

News December 5, 2025

KNR: ‘నజరానా’లంటారు.. ‘నారాజ్’ చేస్తారు..!

image

స్థానిక ఎన్నికల వేళ ప్రకటిస్తున్న నజరానాలు నీటి మూటలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ఉమ్మడి KNRలో 106 GPలు ఏకగ్రీవమవ్వగా తాజాగా 20 GP(1ST ఫేజ్)లు ఏకగ్రీవమయ్యాయి. అప్పటి BRS ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామాలకు రూ.5 లక్షలిస్తానని రూపాయీ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ప్రకటించగా కేంద్రమంత్రి బండి సంజయ్ BJP మద్దతున్న అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.