News March 8, 2025

హనుమకొండ: బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: కలెక్టర్

image

బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని హనుమకొండ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై ఆమె చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

Similar News

News November 22, 2025

MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

image

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.

News November 22, 2025

SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

image

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.