News February 17, 2025
హనుమకొండ: విద్యార్థులకు మరో అవకాశం

హనుమకొండ జిల్లాలో తేదీ 03-02-2025 నుంచి 16-02-2025 వరకు జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాల వల్ల హాజరు కానీ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేదీ: 18-02-2025 నుంచి 22-02-2025 వరకు మళ్లీ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించిందని జిల్లా విద్యాధికారి ఏ.గోపాల్ తెలిపారు. ఈ పరీక్షలు వడ్డేపల్లిలోని పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నామని తెలిపారు.
Similar News
News January 9, 2026
మారేడు దళాల గురించి ఈ విషయాలు తెలుసా?

మారేడు చెట్టును ఇంట్లో పెంచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. దీని దళాలు కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోమ, మంగళ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో వీటిని కోయకూడదు. ఒకసారి శివుడికి అర్పించిన ఆకులను కడిగి తిరిగి 30 రోజుల వరకు పూజకు ఉపయోగించవచ్చు. నేల మీద పడినా ఇవి దోషం కావు. శివార్చనలో మారేడు దళాలను కొబ్బరి నీళ్లలో ముంచి సమర్పిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
News January 9, 2026
‘ఏడాది కాలంలో ఏం సాధించారు?’.. ఉద్యోగులకు అమెజాన్ మెయిల్స్!

గతేడాది 14 వేల <<18191233>>మందిని<<>> తొలగించిన అమెజాన్ ఇప్పుడు ఉన్న ఉద్యోగులపైనా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. ‘ఏడాది కాలంలో మీరు ఏం చేశారు? మీరు సాధించిన 3-5 విజయాల గురించి ప్రస్తావించండి’ అని మెయిల్స్ పంపుతోందని Business Insider తెలిపింది. వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతోందని చెప్పింది. సంస్థపై తమ ప్రభావం, ప్రాజెక్టులు, ఇనిషియేటివ్స్ గురించి ఉద్యోగులు తెలియజేయాల్సి ఉంటుంది.
News January 9, 2026
కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

కుప్పం డివిజన్లోని 26 సబ్స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.


