News April 5, 2025

హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

image

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్‌ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 25, 2025

ఇండస్ట్రీలో ‘Male Ego’ని ఎదుర్కోవాలి: జాన్వీ

image

ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ఓ టాక్ షోలో ఇండస్ట్రీలో పురుష అహంకారంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ‘ఇక్కడ కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలుంటే నా అభిప్రాయం నిర్భయంగా చెప్తా. అదే ప్లేస్‌లో పురుషులుంటే నా ఒపీనియన్ చెప్పలేను. మనకు నచ్చని విషయాలను నేను చేయను అని చెప్పలేక.. అర్థం కాలేదు అని చెప్పాల్సి వస్తుంది’ అని తెలిపారు.

News October 25, 2025

కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌పై BRS ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫేక్ పోస్టులు, తప్పుదారి పట్టించే వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలతో తమ మీద బురద జల్లుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 25, 2025

మంత్రి పొన్నం రాజీనామా చేయాలని AAP డిమాండ్

image

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని AAP తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా.దిడ్డి సుధాకర్ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.