News April 5, 2025
హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 7, 2025
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నర్సంపేట వాసుల ప్రతిభ

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రతిభ కనబర్చారు. వరంగల్లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్ను అందుకున్నారు. కోచ్లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.
News April 6, 2025
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News April 6, 2025
రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.