News April 5, 2025
హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
137 బస్సుల్లో సాంకేతిక లోపాలు గుర్తింపు: DTO

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పలు విద్యా సంస్థలకు చెందిన 260 బస్సులను ఇంతవరకు తనిఖీ చేసామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆ బస్సుల్లో 137 బస్సుల్లో సాంకేతికపరమైన లోపాలు గుర్తించామన్నారు. ఈ లోపాలను వారం రోజుల్లోగా సరిచేయించాలని అక్కడికక్కడే స్కూల్ యజమాన్యాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు.
News December 3, 2025
పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.
News December 3, 2025
తిరుమల: డిసెంబర్ 5న డయల్ యువర్ ఈవో

డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.


