News April 5, 2025
హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 16, 2025
ములుగు: 2 నెలల క్రితమే జిల్లాలోకి దామోదర్ టీం!

మావోయిస్టు నేత బడే దామోదర్ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితమే దామోదర్తో పాటు ఆయన క్యాడర్ ములుగు జిల్లాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరగడం, ప్రస్తుతం తెలంగాణలో కాల్పుల విరమణ ఉండడడంతో సేఫ్ జోన్గా భావించినట్లు సమాచారం. కాగా, జిల్లాలో ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
News December 16, 2025
జగిత్యాల: మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు

జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
News December 16, 2025
స్పిన్నర్కు భారీ ధర

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్సోల్డ్గా మిగిలారు.


