News February 25, 2025

హనుమకొండ: వైన్స్, బార్, రెస్టారెంట్లు బంద్: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు డిపోలు మూసి వేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 17, 2025

NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1

News December 17, 2025

బుచ్చిలో మహిళ ఆత్మహత్యాయత్నం

image

చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుచ్చిలోని చెన్నూర్ రోడ్డులో మంగళవారం జరిగింది. మహందాపురానికి చెందిన శ్రీను నెల్లూరుకు చెందిన భార్గవిని 2ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. ప్రస్తుతం ఆ మహిళ రెండు నెలల గర్భవతి. భర్తని హోటల్లో భోజనం తెమ్మని, భర్త వచ్చేలోపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త గమనించి రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు.

News December 17, 2025

TTDలో కొత్త ఉద్యోగాలు..!

image

TTDలో త్వరలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్‌(పాచక) పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని TTD కోరింది. ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్ట్‌లను పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ధాన స‌న్నిధి యాద‌వ‌తో పాటు అద‌నంగా మ‌రో స‌న్నిధి యాద‌వ పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది.