News April 12, 2025

హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ASF SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్రకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News October 29, 2025

ప్రభుత్వ పాఠశాలలో ఎల్పిజి సిలిండర్ ద్వారా వంట: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల ద్వారా వంట చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇందుకోసం ఎల్పీజీ కనెక్షన్ ప్రతి పాఠశాలలో తీసుకునే విధంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రాబోయే నెల రోజుల్లో కనెక్షన్లు తీసుకునే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌‌కి మంత్రి పదవి: డీకే అరుణ స్పందన

image

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ ఎంతగా భయపడుతుందో మంత్రి పదవి ఇవ్వడంతో తెలుస్తుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయరాదన్న నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 29, 2025

భువనగిరి జిల్లాలో రేపు స్కూల్స్ బంద్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యజమానులు గమనించాలని సూచించారు.