News April 12, 2025

హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ASF SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్రకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News December 10, 2025

ప్రకాశం జిల్లాలో సబ్సిడీతో పెట్రోల్.!

image

ప్రకాశం జిల్లాలో మూడు చక్రాల మోటార్ వాహనాలు కలిగిన అర్హులైన దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్ సబ్సిడీ మంజూరయిందన్నారు. పెట్రోల్ సబ్సిడీ పొందేందుకు ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు కార్యాలయంలో అందించే దరఖాస్తులను 17లోగా అందించాలని ఆమె తెలిపారు.

News December 10, 2025

చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

image

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.

News December 10, 2025

ADB: పల్లెల్లో ఎన్నికలు.. పట్టణాల్లో దావతులు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఉండదని తెలిసి.. ఓటర్లను అక్కడికి తీసుకెళ్లి తమకే ఓటేయాలంటూ ఎర వేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఎన్నికల నిబంధన కారణంగా వైన్స్ మూసివేయడంతో ఓటర్లను పట్టణాలకు తీసుకెళ్తున్నట్లు గ్రామాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వారికి దావత్‌లు ఇచ్చి రేపు ఉదయానికి గ్రామాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు.