News March 2, 2025

హన్మకొండలో రేపు ప్రజావాణి రద్దు

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు  కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా రేపటి ప్రజావాణిని రద్దు చేశామన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News November 6, 2025

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి అచ్చెన్న

image

రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధ‌ర‌లు ప‌త‌న‌మైన‌ప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్ర‌బాబు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.

News November 6, 2025

నియోనాటల్‌ పీరియడ్‌ కీలకం

image

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్‌ పీరియడ్‌‌లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్‌ కేర్‌ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.

News November 6, 2025

కష్టాల్లో ఆస్ట్రేలియా

image

భారత్‌తో నాలుగో టీ20లో 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 30, షార్ట్ 25, ఇంగ్లిస్ 12, డేవిడ్ 14, ఫిలిప్పీ 10 రన్స్‌కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లు అక్షర్, దూబే చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. అర్ష్‌దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 69 రన్స్ అవసరం.