News April 11, 2025

హన్మకొండ: ఉరేసుకొని సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాజీపేటలో జరిగింది. SI నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సంజయ్ కుమార్(26) కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే కాజీపేటలోని బాపూజీనగర్ కాలనీలో మూడు నెలల క్రితం రూ.76లక్షలతో ఇల్లు కొన్నాడు. దీంతో అప్పులు, వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురై అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News April 21, 2025

IPL: ఇవాళ కీలక పోరు

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 21, 2025

MNCL జిల్లాలో విషాదం.. యువరైతు ఆత్మహత్య

image

పంట దిగుబడి వస్తుందో.. రాదోనని కలత చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. పౌనుర్‌కు చెందిన యువ రైతు కుమార్(29)తన ఎకరం పొలంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మేలు ఫిమేల్ సీడ్ వరి వేశాడు. బోరు ఎండి నీరు అందక ఆవేదన చెందాడు. 3 ఏళ్లుగా పంట సాగులో నష్టాలను చవిచూస్తున్న కుమార్ ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

error: Content is protected !!