News April 5, 2025
హన్మకొండ వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను హన్మకొండ జిల్లాలోని మీ MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News April 7, 2025
NIMSలో సోలార్ కరెంట్తో డయాలసిస్ సేవలు..!

HYD NIMS ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఇకపై సౌర విద్యుత్తుతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ గ్రీన్ డయాలసిస్ ఇనిషియేటివ్ పేరుతో రోజుకు 200 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పర్యావరణ హితంగా, నిరాటంకంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
News April 7, 2025
చౌటుప్పల్: ఉరేసుకుని ఒకరి సూసైడ్

వృద్ధుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాటిటీ తంగడపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రాములు ఈ నెల 4న పెన్షన్ తీసుకోవడానికి చౌటుప్పల్ నుంచి తంగడపల్లికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం కొడుకు రాములుకి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారు చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కుమారుడు బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 7, 2025
అవనిగడ్డ: పండుగ రోజు విషాదం.. ముగ్గురి మృతి

శ్రీరామ నవమి పండుగ రోజు మోదుమూడిలో ఆనందం కన్నీటిగా మారింది. రాములోరి ఊరేగింపులో భాగంగా కృష్ణా నదిలో రామ స్తూపాన్ని శుద్ధిచేస్తుండగా ముగ్గురు బాలురు నీటమునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడం, ఒకే కుటుంబానికి వారసులుగా ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. వీరబాబు, వెంకట గోపి కిరణ్, వర్ధన్లు మృతిచెందిన వారిలో ఉన్నారు.