News April 15, 2025

హన్మకొండ: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూరప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, హన్మకొండ జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News November 20, 2025

ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

News November 20, 2025

GWL: బాల్య దశ మరపురానిది -అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు

image

బాల్య దశ ప్రతి ఒక్కరికి మరపురానిదని ఆ దశ అందరి జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఐడిఓసిలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలను ప్రారంభించారు. చదువుకోవడం బాలల హక్కు అని బడి మానేసిన వారిని బడిలో చేర్చాలని, పిల్లలు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

News November 20, 2025

ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.