News April 15, 2025
హన్మకొండ: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూరప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, హన్మకొండ జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
Similar News
News November 18, 2025
నల్గొండ: మిల్లుల సమ్మె.. పత్తి రైతుల దిగాలు

తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ సోమవారం నుంచి చేస్తున్న సమ్మె ప్రభావం ఉమ్మడి జిల్లా పత్తి రైతులపై తీవ్రంగా పడింది. ఈసమస్యపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో, మంగళవారం కూడా మిల్లులు తెరవకుండా సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ తెలిపింది. స్లాట్ బుక్ చేసుకున్న రైతుల కొనుగోళ్లు రద్దు కావడంతో, మళ్లీఎప్పుడు బుక్ అవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి, మిల్లులనుతెరిపించాలని రైతులు కోరారు.
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.


