News March 31, 2025
హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.
Similar News
News January 8, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS స్పెషల్ మ్యానిఫెస్టో

TG: ‘సర్పంచ్’ ఫలితాల జోష్తో మున్సిపల్ ఎన్నికలకు BRS సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీల్లో రాజకీయ ఎజెండాను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించాలని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ జారీ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోను ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.
News January 8, 2026
మరోసారి పడిపోయిన మీషో షేర్లు.. కారణమిదే!

జనరల్ మేనేజర్ మేఘా అగర్వాల్ రాజీనామాతో మీషో షేర్ల విలువ మరోసారి భారీగా పతనమైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే షేర్ వాల్యూ రూ.165కు చేరుకుంది. వరుసగా మూడో సెషన్లో కూడా కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. DECలో రూ.254.40 వద్ద ఆల్టైమ్ హైకి చేరిన షేర్లు బుధవారం మరో 5% పతనమయ్యాయి. తాజాగా లిస్టింగ్కు వచ్చిన మీషో షేర్ వాల్యూ ఇప్పటివరకు 35% పడిపోవడంతో రూ.40వేల కోట్ల సంపద ఆవిరైంది.
News January 8, 2026
పాలమూరును KCR నాశనం చేసిండు: కాంగ్రెస్ MLAలు

KCRపై, BRS నేతలపై బుధవారం వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి <<18795132>>తీవ్రస్థాయిలో మండిపడిన<<>> విషయం తెలిసిందే. వారు మాట్లాడుతూ.. ‘KCR పాలమూరును నాశనం చేసిండు.. సాగునీటి ప్రాజెక్టులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్పై BRS వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తుర్రు.. ప్రాజెక్టులపై, నీటి కేటాయింపులు తదితర అంశాలపై అంబేడ్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రండి’ అని సవాల్ విసిరారు. మీ కామెంట్?


