News February 23, 2025

హన్మాజీపేట పాఠశాల వజ్రోత్సవం.. సీఎం శుభాకాంక్షలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖను విడుదల చేశారు. 75 ఏళ్లుగా అంకితభావం, శ్రద్ధ, పట్టుదలతో అనేకమంది విద్యార్థులకు ఈ పాఠశాల విద్యాబుద్ధులు నేర్పిందని అన్నారు. కవి, రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తి దాయకమన్నారు.

Similar News

News September 16, 2025

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రేపు ప్రయాణికుల సేవా దినోత్సవం

image

బేగంపేట విమానాశ్రయంలో రేపు ప్రయాణికుల సేవా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ కో-ఆర్డినేషన్ ఇన్‌ఛార్జ్ అచింత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, పిల్లల కోసం పెయింటింగ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థులకు విమానయాన రంగంలోని ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

News September 16, 2025

విజయవాడ: అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS)- తిరువణ్ణామలై(TNM) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ మేరకు నం.07219 NS- TNM రైలును OCT 1, 8, 22 & NOV 5, 19, 26న నడుపుతామని, నం.07220 TNM- NS రైలును OCT 2, 9, 23 & NOV 6, 20, 27న నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయన్నారు.

News September 16, 2025

HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

image

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.