News April 15, 2025

హన్వాడ: ప్రజా ప్రభుత్వం రైతుల పక్షమే: ఎమ్మెల్యే

image

ప్రజా ప్రభుత్వం రైతుల పక్షంగానే ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హన్వాడ మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ప్రతి గింజను కొనడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పించామని, బోనస్ అందించామన్నారు.

Similar News

News April 19, 2025

MBNR: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోకముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. రైతు నష్టపోకుండా విత్తన సంస్థలు,డీలర్లు,నాణ్యమైన లేబుళ్లు ప్యాకింగ్ ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.

News April 19, 2025

కొల్లూరు వాసికి డాక్టరేట్

image

నవాబుపేట మండలం కొల్లూరు సత్రోనిపల్లి తండాకు చెందిన జర్నలిస్ట్ మల్లికార్జున్ నాయక్‌‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు ఆయనకు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు.  మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా ఎన్నో ఆలోచనాత్మక కథనాలు, అలాగే తాను సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 

News April 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔జోగులాంబ శక్తి పీఠంలో చండీహోమాలు ✔పెబ్బేరు: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి ✔ఆత్మకూరు: కట్టర్ బార్ మీద పడి ఒకరి మృతి
✔ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగ
✔తెల్కపల్లి: ప్రేమ వివాహం.. అత్తారింటి వేధింపులు
✔పలుచోట్ల భారీ వర్షం
✔గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి
✔మల్లీశ్వరిది ప్రభుత్వ హత్యనే:BRS
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

error: Content is protected !!