News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్కి చెందిన శ్రీనివాస్గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News December 9, 2025
కలెక్టర్ సార్.. శ్రీకాళహస్తిలో శ్మశానాన్నీ వదలడం లేదు..!

శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడి ఇసుకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో చెన్నైకు లారీలతో తరలిస్తున్నారు. శుకబ్రహ్మ ఆశ్రమం వద్ద మొదలు పెడితే తొట్టంబేడు చివరి వరకు ఎక్కడో ఒకచోట ఇసుక తవ్వతూనే ఉన్నారు. చివరకు శ్మశానంలో సైతం తవ్వకాలు చేస్తున్నారు. మనిషి అస్తిపంజరాలను సైతం తవ్వేసి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై తిరుపతి కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
News December 9, 2025
ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
ఎన్నికల పోలింగ్ రోజు సెలవు: కలెక్టర్

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ జరిగే ఆయా మండలాల్లో స్థానిక సెలవు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ స్థానిక సెలవులను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


