News April 6, 2025
హరీశ్.. నీ లేఖల పురాణం ఆపు: బీర్ల ఐలయ్య

హరీశ్ రావును చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని MLA బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన రాసిన లేఖపై స్పందిస్తూ.. ‘పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న హరీశ్ ఇప్పుడు సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ పాలన చేస్తుంటే హరీశ్ రావు లేఖల పేరుతో నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నాడు. రాహుల్ గాంధీకి, KCR కుటుంబానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని ఐలయ్య దుయ్యబట్టారు.
Similar News
News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
News April 18, 2025
JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్సైట్లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
News April 18, 2025
పాలమూరులో నేటి ముఖ్యంశాలు!

✔ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్:NGKL డీఈవో✔కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ ✔పరిశ్రమలపై నాగర్కర్నూల్ ఎంపీ చర్చ ✔BJPకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:చిన్నారెడ్డి✔బీసీ చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ✔పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి:TUCI✔NRPT: Way2News కథనానికి స్పందన.. ‘మొసలిని బంధించారు’✔‘పీయూ RTF కోర్స్ ఫీజులు విడుదల చేయాలి: విద్యార్థులు