News February 10, 2025

హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

image

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపైకి వరద

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామ శివారులో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు డౌన్‌గా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. నేషనల్ హైవే అధికారులు స్పందించి వరద నీటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 29, 2025

డోర్నకల్‌లో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 104.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కురవిలోని అయ్యగారి పల్లిలో 90 మిల్లి మీటర్లు, మహబూబాబాద్ మండలంలో అమనగల్ 89.3, మల్యాలలో 70.8, గూడూరు మండలంలోని భూపతి పేటలో69.0, తొర్రూర్ 67.5, గార్లలో 65 మిల్లి మీటర్లు, గంగారంలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

News October 29, 2025

అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

image

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.