News February 10, 2025
హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 11, 2026
విజయవాడలో మహిళ ప్రాణం తీసిన అగరబత్తి..!

విజయవాడ దోమల నివారణకు వెలిగించిన అగరబత్తి ఓ మహిళ ప్రాణం తీసింది. గుణదలకు చెందిన సుభాషిణి ఆదివారం రాత్రి అగరబత్తి వెలిగించి నిద్రపోగా, అర్ధరాత్రి మంటలు మంచానికి వ్యాపించాయి. ఈ ఘటనలో ఆమె సజీవ దహనమైంది. సోమవారం ఉదయం ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 11, 2026
భద్రాద్రి జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి నోటిఫై చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంగణాల్లో రిసెప్షన్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు
News February 11, 2026
పాదగయలో సామాన్యులకే పెద్దపీట.. VIPలకు ప్రత్యేక సమయాలు!

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించారు. అత్యంత పవిత్రమైన లింగోద్భవ సమయంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


