News March 11, 2025
హాజీపూర్ పీహెచ్సీ తనిఖీ చేసిన కలెక్టర్

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, మందుల నిల్వలను రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Similar News
News December 9, 2025
పంటు రాకపోకలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

గోదావరి నదిపై పంటు రాకపోకలు రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఇన్ల్యాండ్ వెసెల్స్ యాక్ట్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ పంటు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద జల వనరులు, పంచాయతీరాజ్, ఆర్డీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సోంపల్లి, నర్సాపురం, కోటిపల్లి రేవుల వద్ద పంటు రాకపోకలపై సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చర్చించారు.
News December 9, 2025
GWL: ఎన్నికలకు 28 రూట్ మొబైల్ పార్టీలు: ఎస్పీ

గద్వాల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 106 గ్రామ పంచాయతీలు ఉండగా 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 35 సమస్యాత్మక, 56 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు 28 రూట్ మొబైల్ పార్టీలు, 4 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 4 రూట్ ఇన్చార్జీలుగా 13 మందిని నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామన్నారు.
News December 9, 2025
ములుగు: అన్ని ఏర్పాట్లు చేయండి: EC

సజావుగా పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 3,834 పంచాయతీలకు, 27,628 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాకు పోలింగ్ జరుగుతుందన్నారు.


