News March 17, 2025
హాజీపూర్: పెళ్లికెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన <<15782911>>హాజీపూర్<<>>లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన ఫణీంద్రవర్మ(26) ఆదివారం బైక్ పై మంచిర్యాలలోని ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుడిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తల పైనుంచి బస్సు టైర్ వెళ్లడంతో ఫణీంద్రవర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, పాప ఉన్నారు.
Similar News
News September 18, 2025
జగిత్యాల నాయకులకు మన్ కీ బాత్ బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జిల్లాల వారీగా మన్ కీ బాత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేస్తున్న సందేశాలను ప్రతి జిల్లాలో ప్రసారం చేసి, గ్రామస్థాయికి చేర్చే బాధ్యత ఈ నియమిత నాయకులపై ఉండనుంది. JGTL నుంచి పిల్లి శ్రీనివాస్ కన్వీనర్గా, దొణికెల నవీన్ కో-కన్వీనర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
News September 18, 2025
నక్కపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద నేషనల్ హైవేపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. డ్రైవర్ లారీని రోడ్డు పక్క నిలిపాడు. క్లీనర్ మహమ్మద్ జియావుద్దీన్ రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
News September 18, 2025
BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.