News May 4, 2024

హామీలను స్టాప్ పేపర్‌పై రాసిచ్చిన MLA అభ్యర్థి

image

ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

Similar News

News April 22, 2025

RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ 

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు నియంత్రణకు వినూత్న కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాలు మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల ఆపరేటింగ్‌ పై సిబ్బందికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

News April 21, 2025

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

image

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

News April 21, 2025

తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

error: Content is protected !!