News March 8, 2025
హాస్టళ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులకు సంబందించిన పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం సంబంధిత అధికారులతో సమీక్షించారు. వసతి గృహాల మరమ్మతులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను నిర్దేశించిన గడువులోపు పంపాలని ఆదేశించారు.
Similar News
News October 16, 2025
వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కోట్పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన అంతగిరిపల్లి శ్రీను(25) వికారాబాద్లోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. శ్రీను బైక్ పై వికారాబాద్కు వెళ్తుండగా బ్రిడ్జి సమీపంలో వేగంగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 16, 2025
బిహార్లో.. రాజు లేని యుద్ధం.. గెలుస్తారా..?

మనం చూడని చరిత్రలో, చూసిన బాహుబలిలో, ఆడే చెస్లో రాజు లేడంటే ఆ యుద్ధం ముగిసి, ప్రత్యర్థి గెలిచినట్లే. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ సహజ విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా వెనకుండి నడిపించిన ఆయన బిహార్లో జనసురాజ్ పార్టీ పెట్టారు. ఇక్కడా తను పోటీ చేయకుండా JSP అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలో సొంత నేతలకే తెలియట్లేదు.
News October 16, 2025
ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.