News March 23, 2025

హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

image

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Similar News

News February 24, 2026

రూ.2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు: అనకాపల్లి

image

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News February 24, 2026

బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి: సీఎం

image

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల కలకలం నేపథ్యంలో CM CBN అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 మంది డయేరియా బారినపడ్డారని, వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు రిపేర్ పనుల వల్లే నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని CM ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 24, 2026

సిద్దిపేట: వీడని స్నేహం!

image

సిద్దిపేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ అటెండర్ బొమ్మల పృథ్వీరాజ్, తన స్నేహితుడు నవీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టూ టౌన్ CI ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.