News February 16, 2025

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య బాధ్యతల స్వీకరణ

image

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 2 నెలల క్రితం ఎక్సైజ్ సీఐని కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నతాధికారులు బదిలీ చేశారు. విచారణ తర్వాత లక్ష్మీ దుర్గయ్య ఎక్సైజ్ సీఐగా కచ్చితత్వం కలిగిన అధికారిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గతంలో పనిచేసిన హిందూపురం స్థానానికే ఆయనను బదిలీ చేశారు.

Similar News

News November 14, 2025

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

News November 14, 2025

సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి: ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, లాకప్ గదులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్, కేసుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

News November 14, 2025

ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్.. తర్వాత EVM ఓట్ల కౌంటింగ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గం.కు పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభం కానుంది. 8.30 గం. నుంచి EVM ఓట్ల కౌంటింగ్ షురూ చేస్తారు. షేక్‌పేట్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ డివిజన్ల వారీగా లెక్కింపు జరగనుంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,94,631 మంది ఓట్లేశారు. పోలింగ్ శాతం 48.49%గా నమోదైంది.