News March 9, 2025
హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

హిందూపురంలోని ఆటోనగర్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.
Similar News
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలి: పెద్దపల్లి కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6న పిఓ, ఎపిఓలకు శిక్షణ ఇవ్వాలని, ఫారం 14 ఇచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది సమయానికి హాజరయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో 4 సర్పంచ్, 210 వార్డులు ఏకగ్రీవం కాగా, 95 పంచాయతీలు, 670 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరుగనుందని తెలిపారు.
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.


