News March 13, 2025
హిందూపురం: ‘మహిళలు ప్రగతి బాటలో పయనించాలి’

మహిళలు సమస్యలపై అవగాహన పెంచుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి హారిక పేర్కొన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హిందూపురం పరిధిలోని డీసీ కన్వెన్షన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలకు భద్రతపరంగా పోలీసు శాఖ ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. చట్టాలు ఎన్నో మహిళలకు అనుకూలంగా ఉన్నాయన్నారు.
Similar News
News November 16, 2025
నరసరావుపేట: పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై సమీక్ష

అమరావతిలోని బుద్ధ విగ్రహాన్ని ఆధునికరించినట్లు కలెక్టర్ కృత్తిక శుక్లా తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ఆమె సమీక్షించారు. పర్యాటక ప్రాజెక్టు స్థితిగతులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కోటప్పకొండ అభివృద్ధిపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కొండవీడు వద్ద పర్యాటక భవనం నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని చెప్పారు.
News November 16, 2025
MDK: వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.
News November 16, 2025
నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.


