News July 10, 2024

హిజ్రాను మోసం చేసిన కర్నూల్ జిల్లా యువకుడు

image

కర్నూల్ జిల్లా యువకుడు హిజ్రాను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్‌ నగరానికి చెందిన హిజ్రా హసీనా గౌడ్‌తో ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేశ్ కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మోసం చేయడంతో హసీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించారు.

Similar News

News November 17, 2025

విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రీన్ స్టోరేజ్ కీలకం: కేంద్రమంత్రి

image

కర్నూలు జిల్లా పాగిడియాల మండలంలో గ్రీన్‌కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులకు ప్రాజెక్టు పురోగతిపై ఆయన అవగాహన కల్పించారు. అవసరమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.

News November 17, 2025

విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రీన్ స్టోరేజ్ కీలకం: కేంద్రమంత్రి

image

కర్నూలు జిల్లా పాగిడియాల మండలంలో గ్రీన్‌కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులకు ప్రాజెక్టు పురోగతిపై ఆయన అవగాహన కల్పించారు. అవసరమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.

News November 17, 2025

కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

image

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.