News November 2, 2024

హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన గుంటూరు విద్యార్థిని

image

గుంటూరు విద్యానగర్‌కు చెందిన పోతుగుంట్ల చందన అనే విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి గత నెల 11న 18 మంది విద్యార్థుల బృందం హిమాలయాలకు వెళ్లారు. ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంపులో భాగంగా చందన ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పింది. దేశంలో హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన తొలి ప్రైవేట్ కళాశాల కావడం విశేషమని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

Similar News

News November 21, 2025

గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

image

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్‌పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్‌లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.

News November 21, 2025

గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.

News November 21, 2025

గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.