News March 28, 2025
హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
Similar News
News October 18, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ దారుణ హత్య

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలం గేర్రె గ్రామంలో కోడలు రాణిని మామ సత్తయ్య దారుణంగా హత్య చేశాడు. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News October 18, 2025
ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.