News January 24, 2025

హుజురాబాద్: హై స్కూల్ గ్రౌండ్‌లో గుర్తుతెలియని మృతదేహం

image

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్‌లో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

Breaking: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

image

RBI గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.

News December 5, 2025

ఎన్నికల కోడ్.. కామారెడ్డిలో మద్యం విక్రయాలపై ఆంక్షలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు మూడు విడతలలో ఆయా మండలాల్లోని కల్లు దుకాణాలు, మద్యం డిపోలు, వైన్ షాపులు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.