News March 11, 2025
హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి

హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన బండారి రమ్య జ్వరంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఆమెకు వారం రోజుల క్రితం జ్వరం రాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో మంగళవారం జ్వరం తీవ్రతరం కావడంతో మృతిచెందిందని తల్లిదండ్రులు తెలిపారు.
Similar News
News March 23, 2025
కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News March 23, 2025
నేడు జిల్లాలో వివిధ పార్టీల ముఖ్య నేతలు

KNR పట్టణంలో నేడు వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తపస్ ఎమ్మెల్సీ అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు. తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన అవేర్నెస్ పార్కును మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. అనంతరం KNRలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. BRS KNR ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కరీంనగర్కు రానున్నారు.
News March 22, 2025
మంత్రి పొన్నంను కలిసిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.