News March 20, 2025
హుజూర్నగర్లో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామి రోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్ కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.
News January 8, 2026
తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సులు కనపడవు…!

పర్యావరణ పరిరక్షణపై TTD, RTC ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రస్తుతం తిరుమల- TPT మధ్య రోజు 320 డీజిల్ బస్సులు, 64 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. 2027 ప్రారంభంలో తిరుమల- TPT మధ్య నడిచే అన్ని బస్సులు ఎలక్ట్రికల్గా మారనున్నాయి. ఇప్పటికే తిరుపతి మరో 50 బస్సులు అప్రూవల్ కాగా మరో 300 బస్సులు టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. కాగా TPT నుంచి MPL, NLR, కడప మధ్య 36 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయి.
News January 8, 2026
కార్పొరేషన్పై ఎమ్మెల్సీ సారయ్య అలక..!

మొన్నటి వరకు వరంగల్ పోలీసులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్పై ఫైర్ అవుతున్నారు. తమను కార్పొరేషన్ సమావేశానికి మాత్రమే పిలుస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు పిలువడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.


