News February 22, 2025
హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.
Similar News
News December 20, 2025
ఈనెల 23న నల్గొండలో జాబ్ మేళా

జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న (మంగళవారం) జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో ఉదయం జరుగుతుందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి 10th, డిగ్రీ అర్హత గలవారు విచ్చేయాలని కోరారు.
News December 20, 2025
పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి: నల్గొండ కలెక్టర్

ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రామిక్ ఉన్నారు.
News December 20, 2025
పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి: నల్గొండ కలెక్టర్

ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రామిక్ ఉన్నారు.


