News October 12, 2024

హుజూర్‌నగర్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామ రోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుజుర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తోకల మహేశ్ స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడు. దీంతో దసరా పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 12, 2024

NLG: గోపాలమిత్రలు సేవలు భేష్

image

గోపాలమిత్రలు ఆపదలో ఉన్న పశుపోషకులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం వీరు వెళ్లి పశువులకు పశువైద్యం అందిస్తున్నారు. పండగ వేళల్లో సైతం తమ సేవలను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని గోపాలమిత్రల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ కోరారు.

News October 12, 2024

NLG: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

నల్గొండ: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.