News January 25, 2025

హుస్నాబాద్: అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: మంత్రి

image

హుస్నాబాద్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రైతు బజార్ వద్ద సుందరీకరణ జంక్షన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ప్రజలు మెచ్చే పాలనను అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Similar News

News December 2, 2025

కాకినాడ: ‘చంపేసి పారిపోయాడు.. ఇతను కనిపిస్తే చెప్పండి’

image

కాకినాడ రూరల్ ఇంద్రపాలేనికి చెందిన బేతా గంగరాజు (52) తన భార్యను గత నెల 30న హత్య చేసి పరారయ్యాడని ఇంద్రపాలెం ఎస్ ఐ వీరబాబు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎస్ఐ ఫోన్ 9440796521, సీఐ 9440796555 కు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 2, 2025

ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

image

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.

News December 2, 2025

HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

image

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్‌ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.