News January 30, 2025

హుస్నాబాద్: ఉపాధిహామీ కూలీల మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

image

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఉపాధి హామీలో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

Similar News

News December 4, 2025

ఫీటస్ హార్ట్‌బీట్ రాకపోవడానికి కారణాలివే..!

image

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తారు.

News December 4, 2025

రుద్రంగి మండలంలో ఏకగ్రీవం అయిన పంచాయతీలివే

image

రుద్రంగి మండలంలో ఏడు పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. చింతామణి తండా, రూప్లా నాయక్ తండా, వీరుని తండా, అడ్డబోర్ తండా, బడి తండా, గైదిగుట్ట తండా, సర్పంచ్ తండా ఏకగ్రీవం అయిన జాబితాలో ఉన్నాయి. వీటిలో మూడు పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ రాగా, మిగతా నాలుగు పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. ఏడు పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషం.

News December 4, 2025

SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>SIDBI<<>>)లో 14 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA, CMA, MBA, PGDM ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.లక్ష చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in/