News January 28, 2025

హుస్నాబాద్: పొట్లపల్లి ఆలయంలో టెండర్లు పూర్తి

image

హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఫిబ్రవరిలో జరుగనున్న మహా శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీ స్వయంభూ రాజేశ్వర దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర, తదితర వాటిని అమ్మకం దారులు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

కెనడా ‘కల’గానే మిగులుతోంది

image

కెనడాలో విద్య, ఉద్యోగాల కోసం పెట్టుకున్న భారతీయుల వీసా అప్లికేషన్స్ ఈసారి 74% రిజెక్ట్ అయ్యాయి. ఆ దేశంతో రిలేషన్ గ్యాప్‌తో దరఖాస్తులు గణనీయంగా తగ్గగా, అప్రూవల్స్ సైతం అలాగే ఉన్నాయి. 2023లో 20K ఇండియన్స్ అప్లై చేస్తే 32% రిజెక్టవగా ఇప్పుడు 4,515లో అప్రూవ్డ్ 1,196. ఓవరాల్‌గా ఫారిన్ స్టూడెంట్ వీసాలు తగ్గించడంతో కెనడా వర్సిటీలకూ నిధుల లోటు తప్పట్లేదు. ఇక ఇండియన్స్ ఇప్పుడు UK, AUS వైపు చూస్తున్నారట.

News November 4, 2025

మళ్లీ నిర్మల్ జిల్లా డీసీసీ సిట్టింగ్ శ్రీహరిరావుకేనా?

image

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి మరోసారి సిట్టింగ్ అధ్యక్షుడు శ్రీహరి రావుకు దక్కుతుందని ఆయన వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. ఆయన కూడా మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను పార్టీలో జిల్లా పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేశానని అధిష్టానం దృష్టికి ఆయన వర్గీయులు తీసుకువెళ్లారు. ఒకవేళ మళ్లీ శ్రీహరిరావుకు ఇస్తే పార్టీ బలంగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

News November 4, 2025

ఓల్డ్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు ఫ్రీజ్ అయిందా?

image

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT