News January 28, 2025
హుస్నాబాద్: పొట్లపల్లి ఆలయంలో టెండర్లు పూర్తి

హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఫిబ్రవరిలో జరుగనున్న మహా శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీ స్వయంభూ రాజేశ్వర దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర, తదితర వాటిని అమ్మకం దారులు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
గద్వాల్: 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు

గద్వాల్ జిల్లాలో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరిగే గట్టు, గద్వాల్, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని పాఠశాలలకు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడుత ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. నేటితో గ్రామాల్లో మైకులు మూగబోనున్నాయి.
News December 9, 2025
పాలమూరు: ఓటు వేయాలంటే 10 కి.మీ నడవాల్సిందే..!

నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తీవ్రంగా కష్టపడుతున్నారు. వరహాబాద్, మల్లాపూర్ చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాలి. గిసుగండి ఓటర్లు మద్దిమడుగు రావడానికి కూడా 10 కిలోమీటర్లు నడక తప్పడం లేదు.
News December 9, 2025
ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..!

TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాత్రుళ్లు పార్టీలు ఇస్తుండటంతో పాటు సిటీలో ఉద్యోగం చేసే వారికి కాల్ చేసి ఛార్జీలు ఇస్తాం రమ్మంటూ ఆఫర్ చేస్తున్నారు. అటు దండాలు పెడుతూ, కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల పిల్లలు, దేవుడిపై ఒట్లు వేయించుకొని మాట తీసుకుంటున్నారు. ఇతర అభ్యర్థులపై నిఘా పెట్టి వారికి పోటీగా ప్రమాణాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు.


