News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
Similar News
News October 23, 2025
అద్దంకి ప్రకాశం జిల్లాలో కలవనుందా.?

బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని ప్రకాశం జిల్లాలో తిరిగి విలీనం చేసే అంశంపై సీసీఎల్ఏ ఆధ్వర్యంలో వీక్షణ సమావేశం జరిగింది. అద్దంకి సరిహద్దులపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, విడదీసినప్పటి ప్రభావంపై అధ్యయనం చేయాలని సూచించారు. వర్షాభివృద్ధి హెచ్చరికలు, నీటి-మట్టి పరిశీలనలు, అర్జీల పరిష్కారం, గృహాల కేటాయింపు ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డీఆర్ఓ, కలెక్టర్, ఆల్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
News October 23, 2025
చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777
News October 23, 2025
ఏడో తరగతి అర్హతతో ఉద్యోగాలు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒక సంవత్సరం పాటు తాత్కాలిక నియామకం కోసం నోటిఫికేషన్ ప్రకటించినట్లు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఏడో తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలలోపు కర్నూలు జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలన్నారు.