News March 7, 2025

హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.

Similar News

News September 17, 2025

ASF: యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాశ్ (32) అప్పుల బాధతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News September 17, 2025

కలకడ: హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

image

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కలకడ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ముడియంవారిపల్లె, కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్, అతని తండ్రి వెంకటరమణ, తల్లి సుబ్బమ్మపై ముడియంవారిపల్లి ప్రసాద్‌రెడ్డి, గంగిరెడ్డి, పుస్పావతి, శ్రీనివాసులురెడ్డి అతని అనుచరులు కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో నలుగురితో పాటు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.

News September 17, 2025

ములుగు: పెద్దలను స్మరించుకునే ‘కొత్తల’ పండగ

image

ఆదివాసీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు విభిన్నమైనవి. ప్రకృతితో మమేకమై వారు జరుపుకొనే పండుగల్లో కొత్తల(పెద్దల)పండుగ ఒకటి. సెప్టెంబర్‌లో ఉత్తర కార్తె మొదటి పాదం ప్రారంభమైన తర్వాత బుధ, గురువారాల్లో నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు కోడి, యాటపోతులు బలిచ్చి వనభోజనాలకు పోతారు. కొత్త ధాన్యాలు, సాక పోసి మొక్కుతారు. మరణించిన పెద్దలకు నైవేద్యం ఇస్తారు. నూతన వధూవరులకు తమ వంశంలో పూర్తి హక్కులు కల్పిస్తారు.