News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
Similar News
News February 9, 2026
SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.
News February 9, 2026
హుస్నాబాద్ : పొలంలో కుప్పకూలి యువ రైతు మృతి

హుస్నాబాద్ మండల పరిధిలోని అరపల్లెలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్ల అజయ్ యాదవ్ అనే యువ రైతు ఆదివారం పొలం వద్ద ప్రమాదవశాత్తు మరణించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఆయన పొలంలోనే పడిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
News February 9, 2026
గోత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

గోత్రం అంటే మూల పురుషుడి నుంచి ఉద్భవించిన వంశం అని అర్థం. సంస్కృతంలో ‘గో’ అంటే వేదం, భూమి, ఆవు అనే అర్థాలున్నాయి. పూర్వం వశిష్ట, భరద్వాజ వంటి సప్తర్షుల పేర్ల మీద ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. తమ వంశం ఏ గురువు లేదా మహర్షి ఆధ్యాత్మిక పరంపర నుంచి వచ్చిందో ఇది తెలియజేస్తుంది. కాలక్రమేణా ప్రముఖ వ్యక్తులు, పూర్వీకుల పేర్లతో కూడా గోత్రాలు వెలిశాయి. ఇది మన మూలాలను, వంశ గౌరవాన్ని గుర్తుచేసే ఓ పవిత్ర గుర్తింపు.


