News January 30, 2025
హుస్సేన్సాగర్ చుట్టూ టూరిజం సర్క్యూట్!: CM

హుస్సేన్సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, NTR గార్డెన్, ఇందిరా పార్క్ను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
Similar News
News February 24, 2026
HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చయి.
News February 24, 2026
HYD ‘గొంతు’పై కత్తి.. సర్కార్కు హైకోర్టు నోటీసులు

నగరవాసుల గొంతు తడిపే హిమాయత్, ఉస్మాన్సాగర్లలో కాలుష్య కారకాలు పెరిగిపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్& అర్బన్ డెవలప్మెంట్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర పీసీబీ, GHMC, HMDA కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 26కు వాయిదా వేసింది.
News February 24, 2026
DANGER: HYDలో విష జ్వరాలు!

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.


