News April 9, 2025
హుస్సేన్ సాగర్లో యువతిని కాపాడిన హైడ్రా బృందం

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News October 28, 2025
అత్యవసర సమయాల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 24×7 కమాండ్ కంట్రోల్ రూమ్ (8333813228) ఏర్పాటు చేశామన్నారు. చీరాల సబ్డివిజన్ – ఎస్ఐ వి.నాగ శ్రీను (9121104793), బాపట్ల ఎస్ఐ ఎం.విజయ్ కుమార్ (8978777298), రేపల్లె సీసీ డీఎస్పీ పి.రవి ప్రసాద్ (9032030919) ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
News October 28, 2025
వట్టిచెరుకూరులో భారీ వర్షపాతం నమోదు

‘మొంథా’ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వట్టిచెరుకూరు మండలంలో 19.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News October 28, 2025
వనపర్తి: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శిథిలావస్థ భవనాలలో నివాసం ఉండరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. సహాయం కోసం ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించారు.


