News January 3, 2025
హెచ్ఐసీసీలో తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను ఆనాడే చెప్పానని ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందన్నారు. ఈ ప్రాతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందన్నారు.
Similar News
News January 3, 2026
HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
News January 3, 2026
HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.
News January 3, 2026
BIG BREAKING: HYDలో పోరాటానికి సిద్ధమైన BRS

GHMC డీలిమిటేషన్ మీద BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్తో విభజన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ సాధించేందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. జంట నగరాలను ఇష్టం వచ్చినట్లు విడదీసి, ప్రజల మనోభావాల తోటి ఆడుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు BRS పోరాటం చేస్తుందని తలసాని పేర్కొన్నారు.


