News April 10, 2024

హెపటైటిస్ వైరస్‌లతో రోజుకు 3,500 మరణాలు: WHO

image

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వల్ల రోజుకు 3,500 మరణాలు సంభవిస్తున్నాయని WHO వెల్లడించింది. హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లుగా ఉండగా, 2022లో 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం హెపటైటిస్ కేసుల్లో మూడింట రెండొంతులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నట్లు WHO నివేదిక పేర్కొంది.

Similar News

News November 14, 2025

CSKకి సంజూ శాంసన్!

image

స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో పేపర్ వర్క్ పూర్తయిందని వెల్లడించాయి. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని పేర్కొన్నాయి. అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ వచ్చే సీజన్‌లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్‌కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

News November 14, 2025

నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

image

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.

News November 14, 2025

కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

image

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.